అస్సాంలోని బ్రహ్మాపుత్ర నదిలో 45 మంది ప్రయాణికులతో వెళ్తు్న్న పడవ నది మధ్యలో బోల్తాపడింది. సమాచారం అందుకున్న వెంటనే అస్సాం పోలీసు బలగాలతోపాటు డిజాష్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రత్యక్షసాక్షులు వెల్లడించిన కథనం ప్రకారం నదిలో పడిన పడవలోంచి కొంతమంది నది ఒడ్డుకు ఈదుకుంటూ రావడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పడవలోని ప్రయాణికులు గౌహతి నుంచి ఉత్తర గౌహతిలోని మధ్యం ఖండకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING