దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగా ఉంటే ఆకర్షణీయమైన జీతాలు అందుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని కేంద్రీయ విద్యా సంస్థల్లో పీఆర్టీ, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్ వంటి 13,404 పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టును బట్టి ఉండే పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా నియామకాలుంటాయి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఉపాధ్యాయ పోస్టుకు డెమో, ఇంటర్వ్యూ తప్పనిసరి. 


ప్రైమరీ టీచర్‌కు 55 వేల కంటే ఎక్కువే జీతం ఉంటుంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే 75 వేలు దాటి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే 85 వేల వరకూ వేతనం ఉంటుంది. కొంతకాలం ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం అనంతరం సొంతరాష్ట్రంలో చేసేందుకు వీలుంటుంది. డీఎడ్ బీఎడ్ పూర్తిచేసినవారు సైతం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. పీఆర్టీ, టీజీటీ పోస్టులకు సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ భాషకు సంబంధించి పది ప్రశ్నలు కచ్చితంగా ఉంటాయి.


ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 26 ఆఖరు తేదీ. ఏపీలో అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కాగా, తెలంగాణలో హైదరాబాద్, కరీంగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలున్నాయి. పోస్టుని బట్టి 1200-2300 వరకూ ఫీజు ఉంటుంది. 


ఇతర వివరాలు, దరఖాస్తుకు అధికారి వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ సంప్రదించాలి. 


Also read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook