CM Bhagwant Mann Baby News: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రైయ్యారు. ఆయన యాభై ఏళ్ల వయసులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గురువారం రోజున గురుప్రీత్ కౌర్ కు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఈక్రమంలో విభేదాలు తలెత్తడంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సీఎం మాన్ 2022 లో మరో పెళ్లి చేసుకున్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్  ప్రకటన చేస్తూ, తల్లి,  బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలియజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..


పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చరిత్రలో పదవిలో ఉండగానే తండ్రి అయిన తొలి ముఖ్యమంత్రి మాన్. కాగా ప్రస్తుతం  51 సంవత్సరాలు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను రెండేళ్ల క్రితం మన్ వివాహం చేసుకున్నాడు. అతని మాజీ భార్యతో అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఇప్పుడు కెనడాలో స్థిరపడ్డారు. ఈక్రమంలో.. గురువారం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో డాక్టర్ గురుప్రీత్ కౌర్ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.


Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?


భగవంత్ మాన్ కు కూతురు పుట్టడంతో పార్టీనేతలు  ప్రత్యేకంగా వేడుకలు జరుపుకుంటున్నారు. కౌర్ కుటుంబసభ్యులంతా  వేడుకల్లో మునిగిపోయారు. అదే విధంగా.. పలువురు నాయకులు సీఎం భగవంత్ మాన్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook