Corona Cases in India: దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 6,317 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి ధాటికి మరో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒక్కరోజే 6,906 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 575 రోజుల కనిష్ఠానికి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో ఇప్పటి వరకు 3,47,58,481 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 4,78,325 మంది కరోనా ధాటికి మరణించారు. మరోవైపు వైరస్ నుంచి 3,42,01,966 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్ కేసులు ఉన్నారు. 


దేశంలో ఒమిక్రాన్ కేసులు..


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా.. మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 215 దాటింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్​ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా..


ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ వాటానే అధికంగా ఉంటోంది. మరోవైపు డెల్టా వేరియంట్​ సైతం వేగంగా విస్తరించడం వల్ల కొవిడ్​ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా 7,45,639 మంది కరోనా​ బారినపడ్డారు. మరో 7,114 మంది ప్రాణాలు కోల్పోయారు.  


Also Read: Theni Nurse Murder Case: ఆ నర్సు ఇంట్లో 500 పైగా కండోమ్స్.. 150 మంది పురుషులతో అఫైర్!


ALso Read: Earthquake in Bangalore: కర్ణాటకలోని బెంగళూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి