India Covid-19 Update: భారత ప్రజలకు బ్యాడ్ న్యూస్. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈసారి ఈ వైరస్ మరో రూపంలో ఇండియాలోకి అడుగుపెట్టింది. ఇది కొవిడ్ యెుక్క JN-1 సబ్‌ వేరియెంట్‌. దీని దెబ్బకు దేశంలో ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా ఈ వైరస్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు కేరళ, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1701 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వాలన్నీ అలర్ట్ అయ్యాయి. ప్రజలందరూ మాస్కులు ధరించడానికి, వ్యాక్సిన్లు వేసుకోవడానికి రెడీ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ JN-1 కొత్త సబ్‌ వేరియెంట్‌ కు సంబంధించిన తొలి కేసును రీసెంట్ గా కేరళలోని తిరువనంతపురంలో గుర్తించారు. 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన లక్షణాలు కనిపించాయి. దీంతో అందరిలోనూ మళ్లీ భయం మెుదలైంది. అయితే మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. JN-1 వేరియెంట్‌ను సెప్టెంబర్‌లోనే అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు.  ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులు చైనాలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.


సింగపూర్ లో గత వారంతో పోలిస్తే ఈ వీక్ 75 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో 50వేలకుపైగా కేసులు రిజస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ట్రావెల్ అడ్వజరీ జారీ చేసింది సింగపూర్ ప్రభుత్వం. రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దని.. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.


Also Read: Covid-19: సింగపూర్‌లో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు... ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook