Bengaluru Corona Third Wave: కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి తగ్గుతుందనుకునేలోగా..ఊహించినట్టే కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైపోయిందా అనే ఆందోళ కలుగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు పరిస్థితి ఇందుకు ఉదాహరణగా కన్పిస్తోంది. నిన్నటి వరకూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా..మరోసారి పెరుగుతూ కన్పిస్తోంది. అంతేకాదు కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో కలవరం మరింతగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా బెంగళూరులో కరోనా వైరస్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపుతుండటమే దీనికి కారణం. రాష్ట్ర ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం 11 రోజుల్లో ఏకంగా 543 మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 3 వందలుండగా..ఇప్పుడు మరింతగా పెరిగింది. 


ఆగస్టు 1 నుంచి 11వ తేదా వరకూ 9 ఏళ్లలోపు చిన్నారులు 210 మంది, 10-18 ఏళ్ల వయస్సున్నవారు 333 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో 270 మంది బాలికలు కాగా, 273 మంది బాలురున్నారు. 6-15 మధ్య వయస్సువారితో పాటు టీనేజర్లు, నవజాత శిశువులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1669 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. అటు 1672మంది కోలుకున్నారు. 22 మంది ప్రాణాలు కోల్పోగా..రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షల 26 వేల 401కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 36 వేల 933 మంది మరణించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1 లక్షా 69 వేల 332 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. 22 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 


Also read: Petrol prices in Tamilnadu: మూడు రూపాయలు తగ్గనున్న పెట్రోల్ ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook