India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులతో పోల్చుకుంటే.. దేశంలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గత 24గంటల్లో శుక్రవారం (డిసెంబరు 25న) దేశంలో కొత్తగా 22,272 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 251 మంది మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా (Coronavirus) కేసుల సంఖ్య 1,01,69,118 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,47,343 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.78 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also Read: Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం


ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న కరోనా నుంచి 22,274 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 97,40,108 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,81,667 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also Read: Chittoor: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook