Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువరు గాయపడ్డారు.

Last Updated : Dec 26, 2020, 10:22 AM IST
Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Telangana Road Accident - 5 persons killed: హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువరు గాయపడ్డారు. శనివారం ఉదయం (Telangana) వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరోకరరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు (Vikarabad) ప్రమాద స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కూలీలుగా గుర్తించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. Also Read: Chittoor: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి

అయితే వీరంతా కూలీ పనికి వెళుతుండగా ప్రమాదం  (Road Accident) సంభవించింది. పొగ మంచు కారణంగా.. కనబడకపోవడంతో లారీ-బస్సు ఎదురెదురుగా వస్తూ ఆటోను ఢికొన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read: Night Curfew: ఒక్క రోజులోనే కర్ణాటక ప్రభుత్వం యూటర్న్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News