India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. గత 24గంటల్లో గురువారం (డిసెంబరు 24న) దేశంలో కొత్తగా 23,068 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 336 మంది మరణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా (Coronavirus) కేసుల సంఖ్య 1,01,46,846 కి చేరగా.. మరణాల సంఖ్య 1,47,092 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read: New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు కరోనా వైరస్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్


ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతోంది. కరోనా నుంచి 24,661 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 97,17,834 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,81,919 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also Read: Vaikuntha Ekadashi: వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook