Coronavirus New Strain Updates In India | న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండగా.. మరోవైపు కొత్తరకం కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో కొత్తరకం కరోనావైరస్ కేసుల సంఖ్య 90కి చేరింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో తాజాగా మరో 8 మందికి బ్రిటన్‌ స్ట్రైయిన్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి వరకు దేశంలో కొత్త రకం (New strain of COVID-19) కరోనా కేసుల సంఖ్య 82 వరకు ఉంది. తాజాగా నమోదైన కేసులతో దీని సంఖ్య 90కి చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) శనివారం వెల్లడించింది. Also Read: India Covid-19: కొత్తగా 18,222 కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కోవిడ్ న్యూ స్ట్రెయిన్ (Coronavirus) బారిన పడిన వారందరినీ ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఐసొలేషన్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారితో సన్నిహిత సంబధాలున్న వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌ నుంచి భారత్‌కు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకావడంతో న్యూ స్ట్రేయిన్‌పై పలువురు ఆందోళ‌న వ్యక్తంచేస్తున్నారు.


Also Read: Covid-19 Vaccine: 11న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook