Covid Cases in India: దేశంలో ఒమిక్రాన్ కేసులు నానాటికి పెరుగుతున్న క్రమంలో అటు అధికారులతో పాటు ప్రజల్లోనూ భయాందోళనలు ఏర్పడుతున్నాయి. భారతదేశంలో కొత్తగా 6,984 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 247 మంది మరణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 8,168 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు 3,41,46,931 మంది కొవిడ్ వైరస్ నుంచి విముక్తి పొందారు. దాదాపుగా 4,75,888 మంది కరోనా ధాటికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 87,562 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో మరోవైపు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 68,89,025 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్​ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది. 


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు


ప్రపంచవ్యాప్తంగా 6,08,382 కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజాగా 7,271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 27,17,37,744 చేరగా.. మొత్తం మరణాలు 53,36,869 పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 4,99,003 మంది కోలుకున్నారు.  


Also Read: Deadline Dates and Works: డిసెంబర్ 31 లోగా తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి


Also Read: Omicron in Noida: దేశంలో మరో 5 Omicron కేసులు.. 62కు పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook