India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు కొన్నిరోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా సోమవారం కూడా 16వేల కేసులే నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 4న) కొత్తగా 16,375 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 201 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,03,56,845 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,49,850 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసులతోపాటు రికవరీల సంక్య నిత్యం గణనీయంగా పెరుగుతోంది. కరోనా (Coronavirus) నుంచి నిన్న 29,091 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 99,75,958 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,31,036 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.32 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also read: Health Experts: భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ.. కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదు!


ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 8,96,236 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. జనవరి 4వ తేదీ వరకు మొత్తం 17,65,31,997 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also Read: COVID-19 New Strain: దేశంలో 38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook