India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా గురువారం కూడా 18వేల కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 8న) కొత్తగా 18,222 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 228 మంది మరణించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,04,31,639 కి చేరగా.. మరణాల సంఖ్య 1,50,798 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలాఉంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. Also Read: Covid-19 Vaccine: 11న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ


కరోనా (Coronavirus) నుంచి నిన్న 19,253 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (cured cases) వారి సంఖ్య 1,00,56,651 కి చేరింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,24,190 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.41 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also read: COVID-19 Vaccine: తొలి టీకాను ప్రధాని మోదీ తీసుకోవాలి: ఆర్జేడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook