India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలం నుంచి నిత్యం 200లకు పైగా మరణాలు సంభవిస్తుండగా.. ఆదివారం ఈ సంఖ్య భారీగా తగ్గింది. గత 24గంటల్లో (జనవరి 10న) కొత్తగా 16,311 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 161 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,04,66,595 కి చేరగా.. మరణాల సంఖ్య 1,51,160 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. కరోనా (Coronavirus) నుంచి నిన్న 19,299 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి (cured cases) 1,00,92,909 మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,22,526 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.43 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతం ఉంది. Also read: Covid-19 Vaccine: నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ


దేశవ్యాప్తంగా నిన్న 6,59,209 కరోనా (Covid-19) నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 10వ తేదీ వరకు మొత్తం 18,17,55,831 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.


Also Read: Covaxin: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook