Devendra Fadnavis: మహారాష్ట్రలో అంతా అనుకున్నట్లే జరిగింది. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్‌తోపాటు డిప్యూటీ సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఈమేరకు మహారాష్ట్ర రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇందులోభాగంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ కోషియారీతో ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే సమావేశమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌తో చర్చించారు. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు వివరించారు. ఈమేరకు మద్దతు లేఖను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండేతో పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈమేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అంతకుముందు గోవా నుంచి ముంబై చేరుకున్న ఏక్‌నాథ్‌ శిండే, ఆయన వర్గ ఎమ్మెల్యేలు..నేరుగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇంటికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.


Also read: Sanjay Raut: అంతా కలిసి ఉద్దవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారు..సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్..!


Also read: PM Modi Tour in AP: జులై 4న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు..పాల్గొననున్న ప్రధాని..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook