Flight Charges: కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో విమాన ప్రయాణీకులకు మరోసారి షాక్ తగలనుంది. విమానయాన సంస్థలు మరోసారి ఛార్జీల్ని పెంచనున్నాయి. విమాన ఛార్జీల్లో పెరుగుదల ఎంత శాతమంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్(Corona Virus) ప్రారంభమైనప్పటి నుంచి విమాన ప్రయాణీకులకు షాక్ తగులుతోంది. విమానయాన సంస్థల నష్టాల్ని పూడ్చుకునేందుకు ఛార్జీల్ని పెంచుతూ పోతున్నాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) నేపధ్యంలో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో..నష్టాల్నించి గట్టెక్కేందుకు విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్ని జారీ చేసింది. విమానయాన సంస్థల ఛార్జీల్లో మార్పులు చేస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి విమానయాన ధరలు భారీగానే పెరగనున్నాయి. విమానయాన కనీస ఛార్జీల్ని (Flight Charges) 13 శాతం నుంచి 16 శాతం వరకూ పెరగబోతున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ 2 వేల 3 వందల్నించి 2 వేల 6 వందలకు పెరగనుంది. అదే సమయంలో 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ 2 వేల 9 వందల్నించి 3 వేల 3 వందలకు పెరగనుంది.


2020 నుంచి లాక్‌డౌన్(Lockdown) ఫలితంగా విమానయాన సేవలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయగంగా ప్రతికూల వాతావరణం ఉండటంతో విమానయానరంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపధ్యంలో సంస్థల్ని నష్టాల్నించి గట్టెక్కించేందుకు మరోసారి ఛార్జీల్ని పెంచుకునేందుకు అనుమతించింది. 40 నిమిషాల ప్రయాణానికి కనీసం 2 వేల 6 వందలకు పెంచగా..అత్యధికంగా 7 వేల 8 వందలకు చేరుకుంటోంది. 60 నిమిషాల ప్రయాణానికి 3 వేల 3 వందలు కాగా..అత్యధికంగా 9 వేల 8 వందలు కానుంది.


Also read: Covid19 Compensation: కోవిడ్ మృతులకు 4 లక్షల ఆర్ధిక సహాయం ప్రచారంలో వాస్తవమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook