గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలో ప్రస్తుతం ఆ పార్టీ   87 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది.


కాగా హిమాచల్ ప్రదేశ్ కూడా బీజేపీ హవా నే నడుస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలో ప్రస్తుతం ఆ పార్టీ  33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.