సార్వ్రతిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్ంగా ఈ  రోజు  ఐదో విడత ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయ 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఓటు హక్కువినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు దీరారు.  పోలింగ్ కోసం పటిష్థ భదత్రా ఏర్పాట్లు చేశారు.


ఐదో దశలో యూపీ, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో  51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 674 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రోజు పోలింగ్‌తో కలపుకుంటే దేశంలోని  424 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి.  మిగిలిన 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది.