ముంబైలోని ఓ అపార్టుమెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నెపాన్ తీర ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని ఆరో అంతస్తులు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4 గంటల 40 నిముషాలకు ఘటన జరగినట్లు స్థానికులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంటలు చెలరేగిన సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. భవనంలోని ఆరో అంతస్తులో అగ్ని ప్రమాదం జరగడంతో అపార్టుమెంట్లో ఉన్నవారు అంతా ప్రాణాలు కాపడుకోవడానికి పరుగులు తీశారు. మొత్తం భవనం అంతా హాహాకారాలతో మారు మోగింది. మరోవైపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పై అంతస్తులో చిక్కుకున్న ఇద్దరు మహిళలను సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. 


అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.