ఆసీస్ సిరీస్ కు జట్టు ఎంపిక విధానంపై విమర్శలు కొనసాగుతున్నాయి.  తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ స్పందించారు. ఆసీస్ లాంటి బలమైన జట్లతో ఆడే సమయంలో ఇలానా జట్టును ఎంపిక చేసేదని ప్రశ్నించారు. జట్టులో కీలక స్పిన్నర్లైన అశ్విన్, జడేలాలను పక్కన పెట్టడం దారుణమన్నారు. పటిష్టమైన ఆసీస్ పై అత్యుత్తమ స్పిన్నర్లను ఉపయోగించుకోవాలని అన్నారు. కీలక సిరీస్ ఆడే సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదన్నారు. ఆసీస్ లాంటి బలమైన జట్లతో తలపడే సమయంలో ఉన్నంతలో బలమైన జట్టును ఎంపిక మేలని టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు.