ప్రమాదవశాత్తుగా కారు నదిలో పడిన దుర్ఘటనలో అందులో ఏడుగురు ప్రయాణికులలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో స్థానికులు ముగ్గురుని సురక్షితంగా రక్షించగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీళ్లలోనే సజీవ సమాధి అయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. నీటి ఉదృతిని లెక్కచేయకుండా నదిని దాటేందుకు డ్రైవర్ చేసిన దుస్సాహసం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.