మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతంలోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలోని రాణి లక్ష్మీభాయ్ హాస్టల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ ఆవరణలో ఓ శానిటరీ ప్యాడ్ కనిపించడంతో.. దానిని ఎవరు వాడారో తెలపాలని వార్డెన్ స్టూడెంట్స్‌ని అడిగింది. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో.. ఆగ్రహావేశాలకు గురైన ఆ లేడీ వార్డెన్, తన హెల్పర్‌తో కలిసి 40 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి.. చెకింగ్ చేసింది.


ఈ అవమానాన్ని భరించలేక.. ఆ విద్యార్థినుల్లో కొందరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన వైస్ ఛాన్సలర్ ఆర్ పి తివారి దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై వివరాలు సేకరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని వేసి.. మూడు రోజుల్లోగా రిపోర్టు ఇవ్వాలని తెలిపినట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు.