EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త. త్వరలో మీ ఖాతాల్లోకి వడ్డీ జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో..త్వరలో ప్రక్రియ ప్రారంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ (EPFO) ఖాతాదారుకు ఈపీఎఫ్ఓ శుభవార్త అందిస్తోంది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వడ్డీని సంబంధిత ఖాతాల్లో జమ చేయనుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ డబ్బుల్ని వేయనుంది. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓకు కేంద్ర కార్మిక శాఖ నుంచి అనుమతి లభించడంతో త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చ్‌లో ఈపీఎఫ్ఓ కేంద్ర సభ్యుల బృందం సమావేశమై గత ఆర్ధిక సంవత్సరం ఇచ్చినట్టే ఈసారి కూడా 8.5 శాతం వడ్డీరేటును (EPF Interest Rate) కొనసాగించాలని నిర్ణయించింది. వడ్డీ డబ్బులు నేరుగా ఆయా ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే కచ్చితంగా ఎప్పుడనేది ఇంకా స్పష్టత రాలేదు. 


Also read; India Corona Cases Latest News: వరుసగా నాలుగోరోజు లక్ష దిగువన కరోనా పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook