Haryana Singer Murder: హర్యానాలో దారుణం జరిగింది. 12 రోజుల క్రితం అదృశ్యమైన ఓ గాయని దారుణ హత్యకు గురైంది. దుండగులు గాయని మృతదేహాన్ని రోహ్‌తక్ జిల్లాలోని భైరోన్ భైనీ అనే గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన పూడ్చిపెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసినట్లు పోలీసులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతి చెందిన గాయని కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఓ మ్యూజిక్ వీడియో షూట్ నిమిత్తం రవి, రోహిత్ అనే ఇద్దరితో కలిసి ఆమె భీవని ప్రాంతానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వాళ్లిద్దరే ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహంపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు, ఈ కేసు పట్ల పోలీసులు అలసత్వం వహిస్తున్నారని వారు ఆరోపించడం గమనార్హం.


మరోవైపు, ఈ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు రోహ్‌తక్ జిల్లాలోని మేషం పట్టణంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. స్థానిక హోటల్లో ఆ గాయని రవి, రోహిత్‌లతో కలిసి డిన్నర్ చేసినట్లు అందులో స్పష్టంగా కనిపించింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గాయని మృతదేహానికి ఆటోస్పై నిర్వహిస్తే హత్యకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 


Also Read: Cheating Case on RGV: రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు... రూ.56 లక్షలు తీసుకుని మోసం...?
 


Also Read: Amazon Offer: అమెజాన్ బంపరాఫర్.. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, స్పీకర్స్ ఇంకా మరెన్నో వాటిపై భారీ డిస్కౌంట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook