చెన్నై: తమిళనాడులోని మద్రాసు ఐఐటీలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుందని, స్నానపు గదిలో వీడియోలు తీస్తున్నాడన్న ఆరోపణలపై ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశామని పోలీస్ వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. శుభమ్ బెనర్జీ మద్రాసు ఐఐటీలోని ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. కాగా, అదే కాలేజీలో బాధితురాలు పరిశోధన విద్యార్థినిగా ఉన్నారని, సోమవారం రాత్రి ఆమె తరగతి గది నుంచి బయటకు వచ్చి స్నానపు గదికి వెళ్లగా.. ఎవరో తనను వీడియో తీస్తున్నట్టుగా కనిపించిందని, వెంటనే బయటకు వచ్చి  పక్కన ఉన్న పురుషుల స్నానపు గదిని తాళం వేసి, సహ విద్యార్థులను, అధ్యాపకులను పిలిచి తలుపు తీయగా లోపల బెనర్జీ ఉన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 


స్థానిక పోలీసులు ప్రొఫెసర్ మొబైల్‌ను పరిశీలించగా అందులో ఎలాంటి వీడియోలు లేవని, డేటాను డిలీట్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే అనుమాన నివృత్తి కోసం ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని.. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉంటుందని పోలీసులు తెలిపారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..