దేశంలో కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 26,506 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఒక్కరోజు నమోదైన కోవిడ్19 కేసులలో ఇదే అత్యధికం. జులై 10 ఉదయం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య (India CoronaVirus Cases) 7,93,802కి చేరింది. దాదాపు గత 10 రోజులగా దేశంలో కనీసం 20వేలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే హతం


దేశంలో 475 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో దేశంలో కోవిడ్19 మరణాల సంఖ్య 21,604కి చేరింది. అయితే రికవరీ కేసుల రేటు 62శాతంగా ఉంది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 4,95,513 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,76,685 యాక్టీవ్ కేసులున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos