Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 30వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో గురువారం ( డిసెంబరు 10న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 414 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770 కి చేరగా.. మరణాల సంఖ్య 1,42,186 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. ( Coronavirus ) కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. గురువారం కరోనా నుంచి 37,528 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 92,90,834 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 3,63,749 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 94.84 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉంది. Also read: COVID-19 vaccine: ఆ వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి బ్రేక్


ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 8,72,497 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 10వ తేదీ వరకు దేశంలో మొత్తం 15,16,32,223 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Balram Bhargava: కోవిడ్ వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు ధ‌రించాల్సిందే


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి