Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శనివారం ( డిసెంబరు 12న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 391 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,57,029 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,43,019 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం కరోనా ( Coronavirus ) నుంచి 33,136 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 93,57,464 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 3,56,546 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. Also read: Kerala: ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్: సీఎం విజయన్


ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 15,37,11,833 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 12వ తేదీ వరకు దేశంలో మొత్తం 15,37,11,833 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Hyderabad: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook