Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Covid-19 ) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో బుధవారం ( డిసెంబరు 16న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 24,010 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 355 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,44,451 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. బుధవారం కరోనా నుంచి 33,291 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 94,89,740 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,22,366 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. Also read: Watch Video: భవనంపై నుంచి పాదచారులపై కూలిన పిల్లర్


ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,58,960 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 16వ తేదీ వరకు దేశంలో మొత్తం 15,78,05,240 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Telangana: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook