India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొంచెం ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. మూడు వారాల నుంచి దేశంలో కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 69 లక్షల మార్క్ దాటింది. గత 24గంటల్లో గురువారం ( అక్టోబరు 8న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 70,496 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 964 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,06,152 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,06,490 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో 8,93,592 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 59,06,070 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 85.52 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.54 శాతం, యాక్టివ్ కేసుల రేటు 12.94 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: KGF 2 Yash: కెమెరా ముందుకు.. రాఖీ భాయ్


ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 11,68,705 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 8 వరకు మొత్తం 8,46,34,680 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. 


 Also read: Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe