India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసుల మార్క్ 70లక్షలు దాటగా.. రికవరీల సంఖ్య 60 లక్షలు దాటింది. అయితే మూడు వారాల నుంచి దేశంలో కేసులతోపాటు రికవరీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 86.17 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.54 శాతం, యాక్టివ్ కేసుల రేటు 12.30 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 10న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 74,383 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 918 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,53,807 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,08,334 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్


దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 60,77,977 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,67,496 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 10,78,544 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 10 వరకు మొత్తం 8,68,77,242 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe