India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో చాలారోజుల తరువాత నిన్న రికార్డు స్థాయిలో కరోనా మరణాల సంఖ్య తగ్గింది.  అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా భారీగా తగ్గింది. దీంతోపాటు రికవరీ రేటు కూడా రోజురోజుకు భారీగానే పెరుగుతోంది. గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 24న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 50,129 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 578 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 78,64,811 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,18,534 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Dussehra 2020: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా శనివారం కరోనాతో 62,077 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి 70,78,123 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 6,68,154 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 90.00 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.51 శాతం, యాక్టివ్ కేసుల రేటు 8.50 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.  Also read: Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?


ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 11,40,905 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 24 వరకు మొత్తం 10,25,23,469 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe