Coronavirus updates in India: న్యూఢిల్లీ: దేశంలో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి 50వేలకు తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న మళ్లీ 50 వేల మార్క్‌ను దాటాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా 700లు దాటింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులకన్నా రికవరీ రేటు నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 4న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 50,209 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 704 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086 కి చేరగా మరణాల సంఖ్య 1,24,315 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: TRP scam: టెలివిజన్ రేటింగ్స్‌పై కమిటీ ఏర్పాటు


అయితే.. బుధవారం కరోనాతో 55,331 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 77,11,809 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,27,962 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 92.20 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.49 శాతం, యాక్టివ్ కేసుల రేటు 6.31 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Shivraj Singh Chouhan: మత మార్పిడికి వ్యతిరేకంగా ఎంపీలో చట్టం


అయితే బుధవారం దేశవ్యాప్తంగా 12,09,425 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 4 వరకు మొత్తం 11,42,08,384 నమూనాలను దేశంలో పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe