Coronavirus updates in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 46 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రోజూ నమోదయ్యే కేసులకన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.56 శాతం ఉండగా.. మరణాల రేటు 1.48 శాతం ఉంది.  Also read: Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో ఆదివారం ( నవంబరు 8న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 490 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,53,657 కి చేరగా.. మరణాల సంఖ్య 1,26,611 కి పెరిగింది. అయితే.. ఆదివారం కరోనాతో 48,405 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య దేశంలో 79,17,373 కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,09,673 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నట్లు వెల్లడించింది. Also read: Narendra Modi: షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మార్పు: ప్రధాని మోదీ


ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 8,35,401 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 8 వరకు దేశంలో మొత్తం 11,85,72,192 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe