India Corona Update: కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. దేశంలో కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖ పట్టిన కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ఇంకా ఆగలేదు. మొన్నటి వరకూ కేసుల సంఖ్య తగ్గుతుందని ఊపిరి పీల్చుకున్నా..మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 94 వేల 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్ని 80-84 వేల కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్య 94 వేలకు పెరిగింది. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2 కోట్ల 91 లక్షల 83 వేల 121కు చరుకుంది. అటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6 వేల 148 మంది కరోనా కారణంగా మరణించారు. 


దేశంలో ఇప్పటి వరకూ 3 లక్షల 59 వేల 676 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1 లక్షా 51 వేలమంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 11 లక్షల 67 వేల 952 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 20 లక్షల 4 వేల 690 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేయగా..23 కోట్ల 90 లక్షల 58 వేలమందికి కరోనా వ్యాక్సిన్ (Corona Vaccination) అందించారు. 


Also read: Vaccination Certificate: వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో తప్పులున్నాయా..ఇలా సరి చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook