Covid cases in India: దేశంలో కరోనా కేసులు(Covid cases in India) స్వల్పంగా తగ్గాయి. తాజాగా 6,70,847 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,729 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వైరస్ తో 221 మంది ప్రాణాలు(Covid Deaths) కోల్పోయారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
గత ఏడాది ప్రారంభంలో దేశంలో మొదటి కరోనా కేసు(First Covid Case) నమోదైంది. అప్పటి నుంచి 3.43 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. నిన్న 12,165 మంది వైరస్ ను జయించారు. అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 1,48,922 మంది వైరస్‌(Coronavirus)తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.43 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు(Recovery Rate) 98.23 శాతంగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకూ 4,59,873 మరణాలు సంభవించాయి.



Also read: Bihar spurious liquor: బిహార్‌లో పండుగ పూట విషాదం..కల్తీ మద్యం తాగి 24 మంది మృత్యువాత


గురువారం దీపావళి పండుగ సందర్భంగా వ్యాక్సిన్(Covid-19 Vaccine) పంపిణీ తగ్గింది. నిన్న 5,65,276 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. మొత్తంగా 107.7 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.


వరల్డ్ వైడ్..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,09,758 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,418 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,93,42,303కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,45,062కు పెరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి