Coronavirus India Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల కాలంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. నిత్యం 18వేలకు పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. సోమవారం 12వేలకే పరిమితమయ్యాయి. గత 24గంటల్లో (జనవరి 11న) కొత్తగా 12,584 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 167 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,04,79,179 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,51,327 కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. కరోనా (Coronavirus) నుంచి నిన్న 18,385 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా (cured cases) 1,01,11,294 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో (active cases) 2,16,558 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.49 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతం ఉంది. Also Read: Covishield: రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌ రవాణా


దేశవ్యాప్తంగా నిన్న 8,97,056 కరోనా (Covid-19) నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 11వ తేదీ వరకు మొత్తం 18,26,52,887 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also Read: Telangana: తొలి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల రాజేందర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook