India reports 13,451 new COVID-19 infections, 585 deaths in 24 hours : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. 24 గంటల వ్యవధిలో (last 24 hours) స్వల్పంగా కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య మాత్రం 500పైనే నమోదైంది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. మంగళవారం 13,05,962 మంది కరోనా (corona tests) నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 13,451 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. 14,021 మంది కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Horoscope : ఆ రాశి వారికి ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఫలితం దక్కుతుంది


మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. 3.35 కోట్ల(98.19 శాతం) మంది కరోనాను జయించారు. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో గత కొంతకాలంగా యాక్టివ్ కేసులు (Active cases) అదుపులో ఉంటున్నాయి. ప్రస్తుతం 1,62,661(0.48 శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. నిన్న మృతుల సంఖ్యలో బాగా పెరిగింది. 585 మరణాలు నమోదయ్యాయి. అందులో 482 కేరళకు (Kerala) సంబంధించినవి. మొత్తంగా 4,55,653 మంది కరోనా (Corona) కాటుకు బలయ్యారు. ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు 103 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు (doses) పంపిణీ అయ్యాయి. తాజాగా 55,89,124 మంది కోవిడ్ (Covid) వ్యాక్సిన్ తీసుకున్నారు.
Also Read : China Delta Variant: చైనాను వెంటాడుతున్న డెల్టా వేరియంట్, పెరుగుతున్న కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook