India Corona Deaths: భారత్‌లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ కొత్త కొత్త అనారోగ్య సమస్యలు వైద్య నిపుణులకు సవాల్‌గా మారాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్19 మరణాలు భారీగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ల కోసం ఎదురుచూస్తున్నాయి. 18 నుంచి 44 వయసు వారికి పలు రాష్ట్రాలు టీకాలు ఇవ్వడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,40,842 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,65,30,132 (2 కోట్ల 65 లక్షల 30 వేల నూట 32)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 3,741 మంది కోవిడ్19 బారిన పడి చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 2,99,266కి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.


Also Read: Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా


దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,55,102 (3 లక్షల 55 వేల నూట 2) మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్ఛార్జ్ అయ్యారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,34,25,467 (2 కోట్ల 34 లక్షల 25 వేల 467)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 28,05,399 (28 లక్షల 5 వేల 399) COVID-19 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు దాదాపు లక్షకు పైగా అధికం కావడం ఊరటనిచ్చింది. మన దేశంలో ఇప్పటివరకూ 19 కోట్ల 50 లక్షల 4 వేల 184 మందికి టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 


Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook