భారత్‌లో కరోనా వైరస్ పెను సవాల్‌గా మారింది. వైద్యుల చికిత్స ఫలించక భారీ సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, కోవిడ్19 మరణాలు భారీగా చోటుచేసుకోవడం ఆందోళన పెంచుతోంది. బ్లాక్ ఫంగస్ కేసులకు తోడు తాజాగా వైట్ ఫంగస్ సమస్య మొదలైంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 20,61,683 శాంపిల్స్ పరీక్షించగా తాజాగా 2,59,591 మంది కరోనా బారిన పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,60,31,991 (2 కోట్ల 60 లక్షల 31 వేల 9 వందల 91)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,209 మంది కోవిడ్19 బారిన పడి చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య   2,91,331కి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.


Also Read: Gold Price Today 21 May 2021: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు, క్షీణించిన వెండి ధరలు


దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,57,295 (3 లక్షల 57 వేల 2 వందల 95) మంది కరోనా మహమ్మారిని జయించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,27,12,735 (2 కోట్ల 27 లక్షల 12 వేల 735)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 30,27,925 (30 లక్షల 27 వేల 925 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు దాదాపు లక్ష ఎక్కువగా నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. మన దేశంలో ఇప్పటివరకూ 19 కోట్ల 18 లక్షల 79 వేల 503 మందికి టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 


Also Read: Income Tax Returns 2020-21: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగించిన సీబీడీటీ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook