India Reports 3275 new Coronavirus cases: ఇటీవల భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి దాదాపుగా అదుపులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ రెండు డోసుల వాక్సిన్ సహా బూస్టర్ డోస్ కూడా తీసుకోవడం చాలా హెల్ప్ అయింది. ఇక కరోనా పీడ విరగడైపోతుందనుకునే లోపే.. మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. గత వారం రోజుల నుంచి భారత్‌లో మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు (మే 5) కూడా 3,275 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 3,275 కొత్త కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోనే ఎక్కువ శాతం కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 31 లక్షలకు పైగా చేరింది. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా.. 19,719 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,975 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 55 మంది మరణించగా.. 3,010 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 



దేశంలో మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతంగా..  మరణాల రేటు 1.23 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 1,89,63,30,362 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. బుధవారం (మే 4) 13,98,710మంది వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.


Also Read: Rahu Effect: ఇంట్లోని ఈ ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు!


Also Read: నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.