కరోనా సెకండ్ వేవ్ ఉదృతి భారత్‌లో కొనసాగుతోంది. భారత్‌లో నాలుగు రోజుల తరువాత 4 లక్షల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలవుతోంది. పలు రాష్ట్రాలు 2 వారాలపాటు లాక్‌డౌన్ విధించాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,66,161 కరోనా పాజిటివ్ కేసులు(India COVID-19 Cases) నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 3,754 కోవిడ్19 మరణాలు సంభవించాయి. భారత్‌లో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,46,116కి చేరింది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,53,818 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Also Read: Prasada Rao Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత



భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,86,71,222 (ఒక కోటి 86 లక్షల 71 వేల 2 వందల 22)కి చేరింది.  దేశంలో ప్రస్తుతం 37 లక్షల 45 వేల 237 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులతో పాటు డిశ్ఛార్జ్ కేసులు సైతం దాదాపుగా అంతే నమోదు కావడం ఊరట కలిగిస్తుంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 17 కోట్ల 1 లక్షా 76 వేల 603 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.


Also Read: COVID-19 Lockdown: నేటి నుంచి లాక్‌డౌన్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook