India new COVID19 cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో పలు రాష్ట్రాలు ఇదివరకే లాక్‌డౌన్ సడలింపు నిర్ణయాలు తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు ఆంక్షలతో కర్ఫ్యూ వేళలలో సడలింపు చేశాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ మరో 6 వారాల్లో వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో తాజాగా 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,99,35,221 (2 కోట్ల 99 లక్షల 35 వేల 221)కు చేరుకుంది. గత 88 రోజులలో అతి తక్కువ కేసులు నేడు  నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 వరకు దేశంలో 1,422 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు.  దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3,88,135 (3 లక్షల 88 వేల 135)కు చేరుకుంది. 


Also Read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం


జూన్ 20న దేశవ్యాప్తంగా 78,190 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ ఇండియాలో కోవిడ్19ను జయించిన  వారి సంఖ్య 2,88,44,199 (2 కోట్ల 88 లక్షల 44 వేల 199)కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,02,887కు దిగొచ్చాయి. ఇప్పటివరకూ 28 కోట్ల 36 వేల 898 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.


Also Read: International Yoga Day 2021: యోగా కోసం mYoga App ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook