India Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతోంది. కొత్తగా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. తాజాగా రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి మరోసారి పెరుగుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చింది. ఓ దశలో రోజుకు 24 వేలకు చేరుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. ఏకంగా రెండు నెలల గరిష్టానికి కేసులు చేరుకున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 46 వేల 759 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 32 వేల కేసులున్నాయి.


ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 509 మంది మరణించగా..ఇప్పటి వరకూ 4 లక్షల 37 వేల 370 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకూ దేశంలో 3 కోట్ల 26 లక్షల 49 వేల 947 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం దేశంలో గత 24 గంటల్లో 31 వేలమంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 3 కోట్ల 18 లక్షల 52 వేలమంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3 లక్షల 59 వేల 775 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకూ 62 కోట్ల 29 లక్షల 89 వేల 134 మందికి కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination)చేశారు.


Also read: Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సగం రోజులు సెలవులే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook