దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త అదుపులో ఉంది. వరుసగా రెండోరోజూ 14 వేల మందికి కరోనా పాజిటివ్‌గా (Corona positive‌) తేలింది. ఇక కేరళలో మృతుల సంఖ్య కాస్త పెరిగింది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 11,76,850 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,313 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (Covid‌ Positive‌) తేలింది. దీంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరాయి. నిన్న 13,543 మంది వైరస్ నుంచి కోలుకోకున్నారు. మొత్తం రికవరీలు 3.36 కోట్ల మార్కును దాటాయి. గత కొద్దికాలంగా తగ్గుతున్న యాక్టివ్ కేసులకు (active cases) వరుసగా రెండో రోజు బ్రేక్ పడింది. ఆ కేసులు స్వల్పంగా పెరిగి 1,61,555కి చేరాయి. 


Also Read : Air India privatization: ఎంపీలకు షాకిచ్చిన కేంద్రం- ఎయిర్ఇండియా ఉచిత టికెట్లు బంద్!


యాక్టివ్ కేసుల రేటు 0.47 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.19 శాతంగా కొనసాగుతోంది. నిన్న మరో 549 మరణాలు నమోదయ్యాయి. అందులో 471 కేరళ (Kerala) నుంచి వచ్చినవే. దాంతో గత ఏడాది ప్రారంభం నుంచి 4,57,740 మంది కరోనా (Corona) కాటుకు బలయ్యారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి నిన్నటివరకు కేంద్రం 105 కోట్ల టీకా డోసుల్ని (Doses) పంపిణీ చేసింది.


Also Read : Badvel bypoll updates : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ, బీజేపీ మధ్య వాగ్వాదం, ఎస్సై చంద్రశేఖర్ తొలగింపు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి