భారత్ మళ్లీ నవ్వుతుంది..!!
`కరోనా వైరస్` దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐతే లాక్ డౌన్ విధించడంతో కొంత మేర పరిస్థితి మెరుగుపడింది.
'కరోనా వైరస్' దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐతే లాక్ డౌన్ విధించడంతో కొంత మేర పరిస్థితి మెరుగుపడింది.
ఈ క్రమంలో బాలీవుడ్ తారలు.. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, క్రికెటర్ శిఖర్ ధావన్, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, కైరా అద్వానీ, తాప్సీ పన్ను.. ఇలా తారలంతా 'ముస్కురాయేగా.. ఇండియా..' పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ పాటను మీరూ చూడండి..
మరోవైపు బాలీవుడ్ తారలు చేసిన ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా వారికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఇలాంటి ప్రయత్నాలు మంచివని కొనియాడారు. అంతే కాదు ఇండియా విల్ ఫైట్.. ఇండియా విల్ విన్ అని ట్వీట్ చేశారు.