భారత్-నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేపాల్‌ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు ఇండియా సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఖాట్మండు చేరుకున్న సుష్మా స్వరాజ్ శుక్రవారం నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధాన మంత్రి షేర్‌ బహదూర్‌ ద్యూబ, సీపీఎన్‌ మావోయిస్టు సెంటర్‌ చైర్మన్‌ ప్రచండతో వేరువేరుగా సమావేశమయ్యారు.


నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం సాధించేందుకు, ఆ దేశ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రచండతో భేటీ అయిన సందర్భంగా ప్రకటించారు. నేపాల్‌ లో రాజకీయ స్థిరత్వం.. అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సుష్మా హామీ ఇచ్చారని ప్రచండ సమావేశం అనంతరం చెప్పారు. తమ చర్చలు సానుకూలంగా సాగినట్టు చెప్పారు. కాగా.. శుక్రవారం సుష్మా స్వరాజ్‌ నేపాల్‌ రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు.