గుజరాత్ పోలీసులపై దళిత యువనేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు గుజరాత్‌ పోలీసులు కుట్ర చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ విషయం పోలీసు వాట్సాప్ గ్రూప్ (ఏడీఆర్ అండ్ మీడియా)లో ఇద్దరు పోలీసు అధికారుల మధ్య చర్చకు వచ్చిందని చెప్పారు. దానికి సంబంధించి వెబ్ పోర్టల్ లింక్స్ ను కూడా జత చేశారు.
 
ఎమ్మెల్యే, దళిత నేత 
జిగ్నేష్ మేవానీ పోలీసుల కుట్రపై గుజరాత్‌ డీజీపీ, ఆ రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. కర్ణాటకలో బీజీపీకి వ్యతిరేకంగా ఏప్రిల్‌ నెలలో ప్రచారం చేస్తానని జిగ్నేష్ మేవానీ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో 20శాతం దళితులు ఉన్నారని.. ఒక్క దళిత ఓటు కూడా బీజేపీకి పడకుండా ప్రచారం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.