టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో.. వినియోగదారుల కోసం తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ధన్ ధనా ధన్ ఆఫర్ తో తక్కువ ధరకే డేటా అందిస్తున్న జియో..దీపావళి పండగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో రూ.399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది.  ఈ బంపర్ ఆఫర్ ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్


జియో ఇచ్చే క్యాష్ బ్యాక్.. వోచర్ల రూపంలో ఉండనుంది. రూ.399 రిచార్జ్ చేయిస్తే..మొత్తం  రూ. 400 విలువ గల 8 వోచర్లను అందిస్తున్నది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది.  వీటిని మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా వచ్చిన వోచర్లను నవంబర్ 15వ తేదీ తరువాతే వినియోగించుకోవాలి.  అయితే రూ.309 అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు మాత్రమే ఈ వోచర్లు వర్తిస్తాయి.