తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తంచేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని ఎన్నికల కమిషన్ చీఫ్ ఓపీ రావత్ అభిప్రాయపడినట్టుగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ఓ కథనంలో పేర్కొంది. ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ వైఖరి స్వాగతించదగిన పరిణామం కాదని ఓపీ రావత్ చెప్పినట్టుగా ఆ కథనం స్పష్టంచేసింది.